న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మెల్లగా ఇతర దేశాలకు వ్యాప్తిస్తున్నది. గురువారం దేశంలోని కర్ణాటకలో రెండు కేసులను గుర్తించారు. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి దేశాల సంఖ్య 30కి చేరింది. భారత్ 30వ దేశమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 30 దేశాల్లో మొత్తంగా 375 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.
కాగా, నవంబర్ 9న దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇటీవల ప్రకటించింది. ఆ దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా 183 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
గురువారం నాటికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వ్యాపించిన 30 దేశాల్లో నమోదైన కేసుల సంఖ్య..