ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ‘ఓమిక్రాన్’ కరోనా వేరియంట్పై ఆందోళన పెరుగుతోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని తెలిసి పలు దేశాలు సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం కూడా విధించాయి. ఈ ‘ఓమిక్రాన్’ వేరియంట్ బోత్సువానా దేశంలో కూడా వ్యాపించింది.
ఈ ప్రాంతం నుంచి ఒక యువతి కొన్నిరోజుల క్రితం భారత్కు వచ్చినట్లు సమాచారం. సదరు మహిళ ప్రస్తుతం ఎక్కడుందో అధికారులకు తెలియడం లేదు. ఆమె చివరగా నవంబరు 18న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె ఎక్కడకు వెళ్లింది తెలియరాలేదు.
దీంతో బోత్సువానా ఎంబసీని సంప్రదించిన భారత అధికారులు.. సదరు యువతి ఎవరిని కలవడానికి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సదరు యువతి ప్రస్తుతం జబల్పూర్లోని మిలటరీ బేస్లో ఐసోలేషన్లో ఉన్నట్లు బోత్సువానా ఎంబసీ అధికారులు తెలిపారు.
అయితే ఆమె మొబైల్ నంబర్, అలాగే భారత్లో ఆమె ఎవరికి కలిసిందో వారి ఫోన్ నెంబర్లు తమకు ఇవ్వాలని ఎంబసీని మధ్యప్రదేశ్ అధికారులు కోరినట్లు సమాచారం.