మల్లన్నసాగర్పై ప్రతిపక్షాల మాయమాటలు
ఆరు దశాబ్దాల్లో కానిది.. ఆరేండ్లలో చేశాం..
దేవాదులతో కొండపాక, గజ్వేల్ కెనాల్ ద్వారా హల్దీవాగు నింపుతాం..
ముఖ్యమంత్రి కృషితో గజ్వేల్ను ముద్దాడిన గోదారమ్మ
భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
గజ్వేల్ రూరల్, మార్చి 23 : మండుటెండలోనూ గోదావరి నీళ్లను కూడవెల్లి వాగులోకి తీసుకొచ్చి, రైతుల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువ వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మకు పూలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి నీళ్లను కూడవెల్లి వాగులోకి వదిలారు. త్వరలోనే దేవాదుల ద్వారా కొండపాక, సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగు నింపుతామన్న మంత్రి, జగదేవ్పూర్ మండలం బోరబండ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. నీళ్ల కోసం నిరంతరం శ్రమించిన అధికారులు, భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
మండుటెండల్లో గోదావరి నీళ్లను కూడవెల్లి వాగులోకి తీసుకొచ్చి, రైతుల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చరిత్రను తిరగరాసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాల్వ వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మకు పూలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి నీళ్లను కూడవెల్లి వాగులోకి వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతులకు సీఎం కేసీఆర్ ముందుగా చెప్పినట్లే 600 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి, కూడవెల్లి ద్వారా గజ్వేల్, జగదేవ్పూర్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో రైతులు సాగు చేసిన 11వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్న ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు.
కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదలను చరిత్ర పూటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని, కూడవెల్లి వాగుకు కొత్త నడక నేర్పింది ముఖ్యమంత్రి అని అన్నారు. ఆ నాడు మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన రోజున కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు హేళన చేశారన్నారు. రైతులిచ్చిన భూములను రియల్ ఎస్టేట్ రంగానికి, కంపెనీలకు అమ్ముకొని వ్యాపారం చేస్తారని.. ఇలా మాయమాటలతో ప్రజలు, రైతులను మభ్యపెట్టారన్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వ పనితనమే జవాబు అని, రైతులకిచ్చిన మాట కోసం 800 క్యూసెక్కుల నీటిని కూడవెల్లి వాగులోకి వదిలామన్నారు. దీంతో గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలతో పాటు సిరిసిల్ల జిల్లా వరకు నీరు పారుతుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు నీటిని అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం చరిత్రను తిరగరాసిందన్నారు. ఇంజినీరింగ్ అధికారులు రెండు రోజుల పాటు శ్రమించడంతో నేడు రైతులు లక్షలాది రూపాయల విలువైన పంటను కాపాడుకుంటున్నారని చెప్పారు. గతంలో యాసంగి వచ్చిందంటే, సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసి బోరు బావులు వేసుకునే వారన్నారు.
కానీ, నేడు 24 గంటల కరెంట్తో కాల్వల ద్వారా నీటిని అందిస్తూ కేసీఆర్ రైతులకు న్యాయం చేస్తున్నారన్నారు. ఆరు దశాబ్దాల కాలంలో కాని పని ని, నేడు ఆరేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆయా మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే దేవాదు ల ద్వారా కొండపాక, సంగారెడ్డి కెనాల్ ద్వా రా ఖాన్చెరువును నింపితే హల్దీవాగు పారుకుంటూ ఘనపూర్ వరకు నీళ్లు ఉంటాయని, జగదేవ్పూర్ మండలం బోరబండ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. నీళ్ల కోసం నిరంతరం శ్రమించిన అధికారులు, భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, ఈఎన్సీ హరిరామ్, ఎస్ ఈ వేణు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూం రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఏఎం సీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణా శ్రీనివాస్, ఎంపీపీలు అమరావతి, పాండు, జడ్పీటీసీ మల్లేశం, మండలాధ్యక్షుడు మధు, సర్పంచ్ విజయ, ఎంపీటీసీ అశోక్, టీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, రవీందర్రావు, యాదవరెడ్డి, దేవీ రవీందర్, మర్కూక్ కరుణాకర్రెడ్డి, వేణుమనోహర్రావు, చంద్రమోహన్రెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చైత్రమాసంలోనే రైతులు నీళ్లు చూస్తున్నారు.. : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
ఆరుద్రలో వాగులో నీళ్లను చేసే రైతులు.. నేడు చైత్రమాసంలో గోదావరి జలాలను చేస్తూ ఎంతో ఆనందపడుతున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శివుడినెత్తిలో ఉన్న గంగను తెచ్చి, రైతులకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం తాపత్రాయపడే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా గోదావరి జలాలు కూడవెల్లి వాగులో పారుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశంతో మంత్రి హరీశ్రావు స్పందించి రెండు రోజుల్లో గోదావరి నీళ్లను తీసుకొచ్చారన్నారు.