105 ఏండ్ల వయసులో నాలుగో తరగతి పాస్
కొల్లం (కేరళ), జూలై 23: కేరళకు చెందిన అత్యంత వృద్ధ అభ్యాసకురాలు భాగీరథి అమ్మ (107) ఇక లేరు. రెండేండ్ల క్రితం 105 ఏండ్ల వయసులో లిటరసీ పరీక్ష పాసై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలందుకొన్న ఆమె వృద్ధాప్య సమస్యలతో గురువారం రాత్రి స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. కొల్లం జిల్లాలోని ప్రాక్కుళంకు చెందిన భాగీరథి అమ్మ మహిళా సాధికారతకు చేసిన విశేష కృషి చేశారు. దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రతిష్ఠాత్మక ‘నారీ శక్తి’ పురస్కారంతో గౌరవించింది. 2019లో ఆమె నాలుగో తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణురాలై ఈ ఘనత సాధించిన అత్యంత వృద్ధ విద్యార్థినిగా రికార్డు సృష్టించారు.