Gold Seized | అక్రమంగా బంగారం తరలిస్తుండగా ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లను ఎయిర్పోర్ట్ బ్యాగేజీ ట్రాలీ కింద బంగారు కడ్డీలను ఉంచి తరలిస్తుండగా.. అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.1.60కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ముగ్గురిని పట్టుకొని విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారతీయ ప్రయాణికుడిని అరెస్ట్ చేసి, అతని నుంచి మూడు కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.21కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడు నైరోబీ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్పాట్ ప్రొఫైలింగ్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు అధికారులు వివరించారు.