Ram Lalla Idol | అయోధ్య: అయోధ్యలో అత్యంత వైభవంగా బాల రాముడిని కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించిన విషయం తెలిసిందే. అయితే చాన్నాళ్ల నుంచి టెంటులో ఉన్న రాముడి విగ్రహాన్ని(Ram Lalla Idol) ఎక్కడ పెడుతారన్న సందేహం వ్యక్తం అవుతోంది. బాబ్రీ మసీదు ఆవరణలో1949 డిసెంబర్ 22 నుంచి ఓ టెంటులో శ్రీరామున్ని ప్రతిష్టించారు. బాబ్రీ మసీదులో రాముడి విగ్రహం కనిపించిన నాటి నుంచి రెండు వర్గాల మధ్య న్యాయపోరాటం సాగింది. అయితే ఆ పాత విగ్రహాన్ని కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఆలయంలోనే ప్రతిష్టించనున్నట్లు తెలుస్తోంది.
పాత విగ్రహాన్ని కొత్త ఆలయంలో ఓ పీఠంపై ప్రతిష్టిస్తామని ఓ పూజారి వెల్లడించారు. కొత్త రామ్ లల్లా విగ్రహానికి .. ఎదురుగా ఆ పాత విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు చెప్పారు. అయితే ఆ విగ్రహం తరలింపునకు చెందిన పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భగుడిలోకి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్తామని ఓ మీడియాతో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మెన్ న్రుపేంద్ర మిశ్రా తెలిపారు. నిలుచున్న రామ్లల్లాతో పాటు 1949 నాటి మూర్తిని కూడా సింహాసనంపై ప్రతిష్టిస్తామన్నారు.
కొత్తగా నిర్మించిన ఆలయంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ చిక్కిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. 70 ఎకరాలు ఉన్న స్థలంలో.. కొత్త ఆలయాన్ని 2.67 ఎకరాల స్థలంలోనే నిర్మించారు. ప్రస్తుతం తొలి దశ పనులు పూర్తి అయ్యాయి. ఇంకా రెండవ, తుది దశ పనులు డిసెంబర్ 2025 నాటికి పూర్తికానున్నాయి. సుమారు 1500 కోట్ల ఖర్చుతో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రజలు ఇచ్చిన డొనేషన్లతోనే దీన్ని నిర్మించారు.