ముంబై, జూలై 18: ముంబై-వారణాసి ఎక్స్ప్రెస్ రైల్లోని ఇద్దరు లోకోపైలట్లు సకాలంలో స్పందించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో డబ్బు ఏండ్ల వృద్ధుడు హరిశంకర్ ఒక ప్లాట్ఫారం నుంచి మరో ప్లాట్ ఫారానికి రైలు పట్టాల మీదుగా దాటుతున్నాడు. అదే సమయంలో రైలు బయల్దేరింది. వృద్ధుడికి దగ్గరగా వస్తున్నది. దీన్ని గమనించిన చీఫ్ పర్మినెంట్ వే ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ గట్టిగా అరిచారు. విన్న లోకోపైలట్లు ఎస్కే ప్రధాన్, రవిశంకర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. రైలు దాదాపు వృద్ధుడిని తాకినంత పనైంది. అతడు కిందపడిపోయారు. అదృష్టవశాత్తూ గాయాలేం కాలేదు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.