న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్పై రూపాయిన్నర తగ్గిస్తున్నట్టు సోమవారం పేర్కొన్నాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1755.5, ముంబైలో 1708.5గా ఉన్నది.
అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో మాత్రం చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలను 3.9 శాతం(రూ.4,162.5) తగ్గిస్తున్నట్టు ఆయిల్ కంపెనీలు నోటిఫికేషన్లో పేర్కొన్నాయి.