భువనేశ్వర్: ఒడిశాలోని కియోంజర్ జిల్లా, సరసపసి గ్రామంలో దా రుణం జరిగింది. 70 ఏండ్ల వృద్ధురాలిపై కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. స్తంభానికి కట్టేసి చితకబాదాడు. స్థానికుల కథనం ప్రకా రం.. ఆయన పొలంలోని కాలీఫ్లవర్ను తెంపడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాట లు పెరగడంతో కుమారుడు ఆమెను విద్యుత్తు స్తంభానికి కట్టేసి, చితకబాదాడు. ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులను బెదిరించాడు. కాసేపటి తర్వాత స్థానికులు ఆమెను దవాఖానకు తరలించి, చికిత్స చేయించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు నమోదు చేశారు.