భువనేశ్వర్ : ప్రభుత్వ ఆధీనంలోని ఓ హోటల్ను విక్రయించేందుకు యత్నించాడో ప్రబుద్ధుడు. ఓ వ్యాపారిని నమ్మించి.. ముఠాగా భారీ సొత్తును కొట్టేయాలనే ప్రణాళిక రూపొందించి.. చివరకు పోలీసులకు చిక్కారు. ఘటనలో ఒడిశాలోని పూరీలో చోటు చేసుకున్నది. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) యాజమాన్యంలోని హోటల్ను.. ఒడిశా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (OTDC)లో పనిచేస్తున్న మాజీ కాంట్రాక్ట్ ఇంజినీర్ హోటల్ను రూ.15 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నించారని, ఇందుకు అతనే హోటల్ యజమానిగా చెప్పుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.
ఐటీడీసీ అనుబంధ సంస్థ ఉత్కల్ అశోక్ హోటల్ కార్పొరేషన్ ద్వారా స్థాపించిన ఈ హోటల్ 1988 నుంచి పూరీలో ఉంది. ఆర్థిక అవకతవకల ఆరోపణలతో 2005 నుంచి హోటల్ మూసివేశారు. ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున హోటల్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం బిడ్ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఓటీడీసీ మాజీ కాంట్రాక్ట్ ఇంజినీర్, ఐటీడీసీ అధికారిగా చెలామని అవుతూ.. పూరీకి చెందిన ఓ వ్యాపారితో రూ.15కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ కేసులో అనికేష్ సాహు అనే వ్యక్తి చందన్ ఆకాష్ మొహంతిని (ఓటీడీసీ), భువనేశ్వర్లో మాజీ కాంట్రాక్టు అసిస్టెంట్ ఇంజినీర్), మరొక వ్యక్తి తపన్ కుమార్ మొహంతీని రూ.50లక్షలు మోసగించారని ఆర్థిక నేరాల విభాగం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) జేఎన్ పంకజ్ తెలిపారు. డీఐజీ మాట్లాడుతూ జనవరి 2020లో చందన్ ఆకాశ్ మొహంతి తనను ఐటీడీసీ లిమిటెడ్ సీరియ్ ఆఫీసర్గా పని చేసుకున్నాడు. అనికేశ్ సాహు తనను తాను ఐటీడీసీ వివిధ ప్రాజెక్టుల్లో పని చేసే కాంట్రాక్టర్గా పరిచయం చేసుకున్నాడు. సాహు తన స్నేహితుడి ద్వారా తపన్కుమార్ మొహంతిని కలుసుకొని పూరీలోని నీలాచల్ అశోక్ హోటల్ను కొనుగోలు చేయాలని ఒప్పించాడు.
ఇందులో రూ.15కోట్ల చెల్లింపులు, రూ.3కోట్ల లంచాలకు సంబంధించి ఒప్పందాలున్నాయి. 2020, ఫిబ్రవరిలో నిందితులు సెటిల్మెంట్ చేసి బాధితుడి నుంచి ఐటీడీసీ ప్రభుత్వ ఖాతాలో రూ.20 లక్షలు జమ చేయించి.. రూ.30 లక్షల నగదు తీసుకున్నారు. చివరికు బాధితుడు ఐటీడీసీ లిమిటెడ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. తర్వాత బాధితుడు పక్షవాతం రావడంతో జాపశక్తిని కోల్పోయాడు. చివరకు బాధితుడి భార్య ఒడిశా పోలీసులను సంప్రదించింది. దీంతో ఆర్థిక నేరాల విభాగానికి చెందిన బృందం సాహును కటక్లో అరెస్టు చేశారు.
నిందితులపై 419, 420, 467, 468, 471 సహా ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ప్రధాన నిందితుడు చందన్ ఆకాష్ మొహంతీని గత నెలలో వేరే కేసులో అరెస్టు చేశారు. మూడో నిందితుడు బికాష్ మహారాణాను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో మరికొంత మంది కూడా చేరే అవకాశం ఉందని డీఐజీ వివరించారు.