భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ భవనంలోకి ప్రవేశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ మినిస్టర్ ఆఫ్ స్టేట్-హోమ్, ఒడిశా’ అని రాసి ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. టీచర్ మమితా మెహర్ హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవింద సాహుతో మంత్రికి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఆ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశా అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మేరకు బుధవారం నిరసన తెలిపారు. టీచర్ మమితా మెహర్ హత్య ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.