ఇప్పుడే ఎందుకండీ.. చాలా ముందుగా అడుగుతున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేండీ.. ఇవీ.. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్న మాటలు. అలాగే తాము ఏ ఫ్రంటకూ మద్దతివ్వమని, స్వతంత్ర ఫ్రంట్గానే వుంటామని నవీన్ ప్రకటించారు.
రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా ఆ పదవికి పోటీపడే అభ్యర్థిని చూసే తుది నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటి నుంచే ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోమని సీఎం నవీన్ స్పష్టం చేశారు. అసలు అభ్యర్థి ఎవరన్నదే కీలకమని, ఆ తర్వాతే అన్ని నిర్ణయాలూ వుంటాయన్నారు. ఎప్పటికీ స్వతంత్రత వైపే మొగ్గు చూపుతామని సీఎం నవీన్ పట్నాయ్ అన్నారు.