భువనేశ్వర్ : ఒడిషాలోని కొరాపుట్ జిల్లాలో దుర్గా పూజ మంటపంలో స్టేజిపై పాటలు పాడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ప్రముఖ గాయకుడు మురళి మహాపాత్ర మరణించారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. జపోర్ పట్టణంలో వేదికపై నాలుగు పాటలు పాడిన అనంతరం అస్వస్ధతకు లోనైన మహాపాత్ర స్టేజిపైనే కుర్చీలో కూర్చుండిపోయారు.
ఆపై ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మురళి మహాపాత్ర గుండెపోటుతో మరణించారని ఆయన సోదరుడు విభూతి ప్రసాద్ మహాపాత్ర ప్రకటించారు. మహాపాత్ర మృతి పట్ల ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు.
కోల్కతాలో జరిగిన కాన్సర్ట్ అనంతరం హోటల్లో సింగర్ కేకే మృతి ఘటనను మహాపాత్ర విషాదాంతం గుర్తుకుతెచ్చింది. మహాపాత్ర జేపూర్ సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. మరో తొమ్మిది నెలల్లో ఆయన రిటైర్ కానుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.