రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) మహేంద్రగఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. విధి నిర్వహణలో ఉన్న ఓ నర్సుపై (Nurse) నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు మహేంద్రగఢ్లోని చిప్పచ్చిపై గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్నది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హాస్పిటల్లో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నలుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. దవాఖానలోనే ఆమెను కట్టేసి సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే హత్యచేస్తామని బెదిరించారు.
బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు 17 ఏండ్ల మైనర్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పని ప్రదేశంలో తమకు సరైన రక్షణ కల్పించకపోతే పనిచేసేది లేదని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.