భోపాల్: తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు రేపు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓడెదెవరు..? గెలిచేదెవరు..? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ను మీడియా పలుకరించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, బీజేపీ మీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో సర్కారు కూలిపోయిందిగా అని మీడియా ప్రశ్నించగా.. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని డిగ్గీ రాజా చెప్పారు. ఇప్పుడు మా పార్టీలో సింధియా లేడని, విశ్వాసఘాతకులు లేరని, కాబట్టి హార్స్ ట్రేడింగ్ భయం మాకు లేదని దిగ్విజయ సింగ్ అన్నారు.
#WATCH | Replying to a question on horse trading, Former Madhya Pradesh CM and Congress leader Digvijaya Singh says, “…Now we have no Scindia left. Now there is no traitor.” pic.twitter.com/caCwiuV2lM
— ANI (@ANI) December 2, 2023