ముంబై: మహారాష్ట్రకు 50 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం నిలిపివేయడం సరికాదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిపై కేంద్రంతో మాట్లాడతారని అన్నారు. మహారాష్ట్రకు ప్రతి రోజు 1750 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను కర్ణాటక నిలిపివేస్తే దాని ప్రభావం చాలా ఉంటుందన్నారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఆక్సిజన్ కొరత ఉన్నదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి 50 టన్నుల ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయవద్దని కేంద్రానికి మంత్రి రాజేష్ తోపే విజ్ఞప్తి చేశారు.