న్యూఢిల్లీ, జూలై 23: కరోనా కారణంగా ఈ ఏడాది నీట్ పరీక్షను గానీ, ఇతర ప్రవేశ పరీక్షలను గానీ రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. నీట్ పీజీ, యూజీ ఎంట్రన్స్ పరీక్షలను సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి భారతీ పవార్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా కొవిడ్ నిబంధనలతో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.