న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదేశాలు ఇవ్వలేదని కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై నమోదు అయిన అఫిడవిట్లో సుప్రీం విచారణ చేపట్టింది. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా గ్యాప్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని తాము ఆదేశించలేమని సుప్రీంకు కేంద్రం వెల్లడించింది. రహదారులపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు .. ప్రభుత్వ ఉద్యోగులు కార్పూలింగ్ చేయాలని సూచించినట్లు కేంద్రం చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడుతున్న వాహనాల సంఖ్య చాలా తక్కువ అని, వారి వాహనాలను నిలిపివేయడం వల్ల వాయు నాణ్యతలో ఎటువంటి మెరుగుదల ఉండదని కేంద్రం తెలిపింది.