సియోల్, జూలై 12: నిత్యం క్షిపణులతో కుస్తీ పడే ఉత్తర కొరియా తాజాగా అత్యంత శక్తివంతమైన పరీక్షను నిర్వహించింది. తన తొలి ‘ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి’ని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఓ వైపు అమెరికా, మరోవైపు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఉత్తర కొరియాపై ఓ కన్నేసి ఉంచిన నేపథ్యంలో తన బలాన్ని చాటిచెప్పడానికే ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్షను నిర్వహించినట్టు తెలుస్తున్నది. అయితే ప్రమాదకరమైన ఈ క్షిపణి పరీక్షపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరీక్షలను మానుకోవాలని సూచించింది.