న్యూఢిల్లీ, మే 31: ఈసారి నైరుతి రుతుపవనాల సమయంలో దేశవ్యాప్తంగా సమృద్ధిగా వానలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనావేసింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని తెలిపింది. 103 శాతం వర్షపాతం రికార్డు కావొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇంతకుముందు దీర్ఘకాలిక సగటులో 99 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని ఏప్రిల్ అంచనాల్లో ఐఎండీ పేర్కొన్నది. మధ్యభారతం, దక్షిణ భారతంలో సాధారణం కంటే అధిక వర్షపాతం రికార్డు అవుతుందని ఈశాన్య, వాయవ్య భారతం లో సాధారణ వర్షపా తం నమోదవుతుందని మహాపాత్ర చెప్పా రు. ఈసారి సాధారణం కంటే మూడు రోజుల ముందే గత ఆదివారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన విషయం తెలిసిందే. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను పలుకరిస్తాయి.