న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు కొనసాగుతున్నదని, తుది నివేదిక సమర్పణకు నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ పేర్కొన్నారు. జమిలి ఎన్నికల అంశం ఏండ్లుగా లా కమిషన్ వద్ద పెండింగ్లో ఉన్నది.
ఏకకాల ఎన్నికలపై గత లా కమిషన్ మూడు ఆప్షన్లు ఇచ్చింది. అయితే పలు అంశాలను పరిష్కరించాల్సి ఉన్నదని ముసాయిదా నివేదికలో పేర్కొన్నది. అలాగే ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. హంగ్ పార్లమెంట్, అసెంబ్లీపై పలు కమిటీలు సూచనలు చేశాయని పేర్కొంది. తాజా కమిషన్ దీనిపై మరింత కసరత్తు చేస్తున్నది.