భాక్రా రైలులో 73 ఏండ్లుగా ఉచితం
న్యూఢిల్లీ, మే 15: రైలులో వెళ్లాలంటే ఏం చేయాలి..? ముందుగా టికెట్ తీసుకోవాలి.. అయితే ఓ రైలుంది.. అందులో వెళ్లాలంటే టికెట్ అవసరం లేదు. టికెట్ లేకుండా ట్రైన్ జర్నీయా.. వినడానికే ఎంతో బాగుంది కదూ.. ఈ ఆఫర్ ఏదో ఒక్క రోజుది కాదు.. ఏకంగా గత 73 ఏండ్లుగా ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందిస్తున్నది.
దేశంలో ఉచితంగా ఫ్రీ సర్వీస్ ఇస్తున్న ఏకైక రైలు భాక్రా ప్యాసింజర్ సర్వీస్.. నంగల్ నుంచి భాక్రా వరకు నడుస్తున్నది. దాదాపు రోజూ 300 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుస్తున్నది. ఈ రైలులో ఎక్కువగా స్కూల్ విద్యార్థులే ప్రయాణిస్తారు. 1948లో భాక్రా-నంగల్ డ్యాం నిర్మిస్తున్న సమయంలో ప్రజలు ప్రయాణించేందుకు వేరే మార్గం లేకపోవడంతో రైలు మార్గం ఏర్పాటు చేశారు.