IndiGo | ముగ్గురు ప్రయాణికులు మద్యం సేవించి విమానంలో సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వచ్చిన వార్తలపై ఇండిగో సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. అలాంటి ఘటనలేవీ విమానంలో జరగలేదని స్పష్టం చేసింది. ‘ఢిల్లీ-పట్నా విమానంలో జరిగిన ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా విమానంలో ఎలాంటి గొడవలు, ఘటనలు జరగలేదు’ అంటూ ట్వీట్ చేసింది.
ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో.. ముగ్గురు వ్యక్తులు ఫుల్గా మద్యం సేవించి విమానంలో వికృత చేష్టలకు పాల్పడినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు అందులో పేర్కొన్నారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్పై దాడి చేశారని.. దీంతో వీరి గురించి విమాన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చినట్లు పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్ఎఫ్ అధికారులు వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారని.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపాయి. అయితే ఈ వార్తలను ఇండిగో తాజాగా ఖండిస్తూ.. క్లారిటీ ఇచ్చింది.