న్యూఢిల్లీ: పలు పార్లమెంటరీ ప్యానెళ్లను మంగళవారం పునర్వ్యవస్థీకరించారు. హోం వ్యవహారాలు, ఐటీసహా కీలకమైన నాలుగు పార్లమెంటరీ ప్యానెళ్లలో ఒక్కటి కూడా ప్రతిపక్ష పార్టీలకు దక్కలేదు. కీలకమైన హోం, ఐటీ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, ఆరోగ్యంపై కమిటీల చైర్మన్ గిరీలు అధికార బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్ష ఎంపీలకు రావడం గమనార్హం.
తాజా పునర్వ్యవస్థీకరణలో రెండు కీలకమైన చైర్మన్ పదవులను కాంగ్రెస్ కోల్పోయింది. హోం శాఖ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్థానంలో బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్ నియమితులయ్యారు. ఐటీ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్థానంలో మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన ఎంపీ ప్రతాప్రావ్ నియమితులయ్యారు.