ముజఫర్నగర్, నవంబర్ 29: తమ సమస్య పరిష్కారానికి ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలోని 12 గ్రామాలకుపైగా ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. వారి గ్రామాలను కలిపే రోడ్డును తిరిగి నిర్మించకుంటే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనబోమని తేల్చిచెప్పారు. ఖటోలి బ్లాక్ పరిధిలోని చంద్సామద్ గ్రామంలో పొరుగు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు ఆదివారం సమావేశమయ్యారు. తమ గ్రామాల పరిధిలో దెబ్బతిన్న ఖటోలి-ఫల్వదా రోడ్డును బాగుచేయకుంటే ఎన్నికలను బహిష్కరిచేందుకు నిర్ణయం తీసుకున్నామని పంచాయతీ కన్వీనర్ సమే సింగ్ పేర్కొన్నారు. ఈ పంచాయతీకి అంథేర్పుర, అదంపూర్, చందపురి, చంద్సామద్, ఫహీంపూర్, జసోలా, కత్లి, మోచ్డి, మంద్వాడి, నగ్లి, సధరన్, షాపూర్, శిఖేద, శిఖిందర్పూర్ గ్రామాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు.