తిరువనంతపురం : ఉగ్రవాదం ప్రాణాలకు ముప్పని కేరళ హైకోర్టు పేర్కొన్నది. ఐసిస్లో చేరడం సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన కేసులో ముగ్గురికి విధించిన శిక్షపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. ఉగ్రవాదం అనేది ప్రజల జీవితం, స్వేచ్ఛ, దేశ అభివృద్ధిని ప్రభావితం చేసే దుర్మార్గమైందని పేర్కొంది.
ఏ మతం ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయదని, అయితే కొందరు మతోన్మాదులు, ఛాందసవాదులు ఉగ్రవాదం, ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు మతం ఆలోచనలను వక్రీకరించారని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్, హంసాలకు బెయిల్ నిరాకరించింది. ఉగ్రవాద సంస్థల పిలుపునకు ఆకర్షితులవుతున్న అమాయక యువకులు హింస, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, సమాంలో శాంతిని ధ్వంసం చేస్తున్నారన్నారు. తమ తోటివారి స్వేచ్ఛ, భద్రత, చిత్తశుద్ధిని పట్టించకోవడం లేదని కోర్టు పేర్కొంది. దేశానికి ఎంత హాని కలిగిస్తున్నారో గ్రహించడం లేదని కోర్టు పేర్కొంది.