న్యూఢిల్లీ: పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు ఎలాంటి ప్రయోజనాలను కల్పించకూడదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా ఉద్ఘాటించారు. అటువంటి ప్రయోజనాలతో కూడిన స్వతంత్ర న్యాయ వ్యవస్థ మనకు అక్కర్లేదని పేర్కొన్నారు.
ఓ సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్ర న్యాయమూర్తుల అవసరం ఉన్నదని, ఇలాంటి న్యాయమూర్తులు తమంతట తాముగా నిలబడేలా వెన్నెముకను కలిగి ఉండటంతోపాటు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని తెలిపారు.