న్యూఢిల్లీ: లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి దర్యాప్తు సంస్థ లోక్పాల్ ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా విచారించలేదు. ఈ నేపథ్యంలో లోక్పాల్ పనితీరు సంతృప్తి స్థాయికి చాలా దూరంలో ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది.
నిరోధించే వ్యవస్థగా కన్నా సమర్థవంతమైన వ్యవస్థగా పని చేయడానికి లోక్పాల్ మొగ్గు చూపాలని ప్యానెల్ కోరింది. నిర్ణీతమైన పద్ధతిలో లేవని సాంకేతిక కారణాలను సాకుగా చూపి నిజమైన, వాస్తవమైన ఫిర్యాదులను తిరస్కరించవద్దని లోక్పాల్కు సూచించింది. పార్లమెంట్కు సమర్పించిన నివేదిక ప్రకారం చాలా ఫిర్యాదులను లోక్పాల్ క్షేత్రస్థాయిలోనే కొట్టి వేస్తున్నది.