న్యూఢిల్లీ: పీఎం-కిసాన్ పథకం కింద ఏటా రైతులకు ఆర్థిక సాయం కింద ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని కేంద్రం ప్రకటించింది. లోక్సభలో సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఈమేరకు సమాధానమిచ్చారు. ఎన్నికల ఏడాది నేపథ్యంలో పీఎం-కిసాన్ మొత్తాన్ని రూ.8,000 నుంచి రూ.12,000 వరకు కేంద్రం పెంచనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రకటనేదీ లేకుండానే మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని ముగించారు.