న్యూఢిల్లీ: జాయిం ట్ సెక్రెటరీ, ఆ పై హోదాలో ఉన్న అధికారులపై అవినీతి ఆరోపణల కేసుల్లో దర్యాప్తునకు ప్రభుత్వం నుంచి ముం దస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ అధికారులకు దర్యాప్తు నుంచి రక్షణ కల్పిస్తున్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం-1946లోని సెక్షన్ 6(ఏ)ను సుప్రీంకోర్టు 2014లోనే కొట్టివేసిందని గుర్తుచేసింది. ఢిల్లీకి చెందిన ఓ అధికారి దాఖ లు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. డీఎస్పీఈలోని సెక్షన్ 6(ఏ)ను రాజ్యాంగ విరుద్ధమని 2014లో సు ప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2003 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చినట్టు భావించాలని స్పష్టంచేసింది. పలు నేరాల్లో శిక్షల నుంచి రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 20తో డీఎస్పీఈ సెక్షన్ 6(ఏ)కు ఏ సంబంధమూ లేదని తేల్చిచెప్పింది.