బెంగళూరు: వినాయక చవితికి ఒక్కరోజు ముందు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఈద్గా మైదాన్లో గణేశ్ ఉత్సవాలు నిర్వహించకుండా స్టేటస్ కో విధించింది. ఈ నేపథ్యంలో ఈద్గా మైదాన్లో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి రేపు అక్కడ ఉత్సవాలు జరిగే అవకాశం లేదు.
ఈద్గా మైదాన్లో గణపతి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చుకోవచ్చని ఇటీవల కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డును సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈద్గా మైదాన్లో గత 200 ఏండ్లుగా ఎలాంటి మతపరమైన ఉత్సవాలు జరుగలేదని, ఇప్పుడు కొత్తగా అలాంటి ఉత్సవాల నిర్వహణకు అవకాశం ఇవ్వొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.
వినాయక చవితికి కేవలం ఒక్కరోజు ముందు వక్ఫ్ బోర్డు పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కర్ణాటక హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.