చెన్నై, మే 21: కరోనా పేరు చెప్పి రైలు టికెట్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీని నిలిపివేసిన మోదీ సర్కారు.. మళ్లీ దాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. శనివారం తమిళనాడులోని ఐఐటీ మద్రాస్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రైల్వే నిర్వహణకు కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూ.100కు ప్రయాణికుల నుంచి రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నదని తెలిపారు. దీని దృష్ట్యా మళ్లీ ప్రత్యేకంగా రాయితీని ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. కరోనా వల్ల 2020 మార్చిలో రైలు టికెట్లపై వృద్ధులకు రాయితీని కేంద్రం నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డా, రాయితీని పునరుద్ధరించలేదు. ఈ రెండేండ్ల కాలంలో వృద్ధులపై అదనంగా రూ.1,500 కోట్ల భారం పడింది.