పనాజీ, డిసెంబర్ 4: దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) వల్ల న్యాయ కోర్సుల్లోకి నైతిక విలువలు ఉన్న విద్యార్థులు రావటం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నా రు.
క్లాట్ ద్వారా విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే పరీక్షిస్తున్నామని, నైతిక ప్రవర్తనను పరీక్షించలేకపోతున్నామని చెప్పారు. గోవాలోని పనాజీలో ‘ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐయూఎల్ఈఆర్)ను సీజేఐ శనివారం ప్రారంభించారు. మంచి విలువలను ప్రోత్సహించే విద్యార్థులను కళాశాలల్లోకి తీసుకురావాలన్నారు.