Supriya Sule | శరద్ పవార్ నేతృత్వంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పార్టీని ఏ రాజకీయ పార్టీలో విలీనం చేసే ఆలోచన లేదని ఎంపీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే స్పష్టం చేశారు. పవార్ నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో భాగంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని.. మహా వికాస్ అఘాడి కూటమిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సుప్రియా తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ విలీనం కానుందన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పష్టత ఇచ్చారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ దేశ్ముఖ్, రాజేశ్ తోపే, ఎంపీలు అమోల్ కోల్హే, శ్రీనివాస్ పాటిల్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీ విలీనం వార్తలను ఆయన తోసిపుచ్చారు. అందుకు ఎలాంటి అవకాశం లేదని.. ఈ విషయంలో ఎలాంటి జరుగలేదని స్పష్టం చేశారు. కొత్త ఎన్నికల గుర్తు ఎంపికపై నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కొత్త గుర్తు, పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్న ప్రశాంత్ జగ్తాప్ వెల్లడించారు.
రాజ్యసభ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం సమావేశం నిర్వహించామని, అలాగే నెల 24న పుణేలో జరిగే ఇండియా కూటమి ర్యాలీపై చర్చించినట్లు నేతలు జగ్తాప్ తెలిపారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది జూలైలో అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలో చీలక ఏర్పడింది. ఈ నెల 6న ఎన్నికల కమిషన్ అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అజిత్ పవర్ వర్గానికి గడియారం గుర్తు సైతం కేటాయించింది. ఈసీ నిర్ణయాన్ని శరద్ పవార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.