ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ దాదాపుగా కోటీశ్వరులనే తమ అభ్యర్థులుగా ప్రకటించారు. ఎన్నికలంటేనే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం… పంచడం.. ఇవన్నీ ఎన్నికల సమయంలో నడిచేవి. అయితే అత్యంత నిరుపేదలు కూడా ఎన్నికల్లో నిలబడతారు. అన్ని పార్టీలూ కాస్తో కూస్తో ఇలాంటి వారికి కూడా టిక్కెట్లు ఇస్తుంటారు. వీరి వద్ద కోట్లకు కోట్ల రూపాయలు లేకున్నా… ప్రజల్లో విశేషమైన ఆదరణ వుంటుంది. అందుకే వారికి కూడా టిక్కెట్ ఇస్తుంది. అచ్చు ఇలాంటి వారే పంజాబ్ ఎన్నికల్లో నిలుచున్నారు. వారు అత్యంత నిరుపేదలు. ఉండడానికి సొంత ఇళ్లు కూడా లేదు. జేబులో ఓ 5,000 రూపాయలు ఉంటే మహా గగనం. అయినా ఈ 10 మంది ఎన్నికల్లో అభ్యర్థులుగా నిల్చున్నారు. ఈ 10 మంది అభ్యర్థుల్లోనే ఐదుగురి వద్ద అసలు ఆస్తులే లేవు.
ఆస్తులే లేని వారి జాబితా
1. రాజ్ కుమార్ (బటిండా అర్బన్)
2. జగనీత్ సింగ్ (గెహనౌర్)
3. నవజ్యోత్ సింగ్ (సనౌర్)
4. జ్యోతి తివారీ (పాటియాలా)
5. గుర్జీందర్ సింగ్ (ఫాజిల్కా)
నిరుపేద అభ్యర్థుల జాబితా ఇదీ…
1. హర్చాంద్ సింగ్ : లుధియానా పాయల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేవలం 2,000 రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.
2. మునీశ్ కుమార్ : పఠాన్కోట్ భోవా నియోజకవర్గం. శిరోమణి అకాలీదళ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2,100 రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
3. దేవీందర్ సింగ్ : అమృత్ సర్ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.శిరోమణి అకాలీదళ్ టిక్కెట్ ఇచ్చింది. ఈయన దగ్గర మొత్తం 4,200 రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి.
4. జోగీందర్ : ఫిరోజ్ పూర్ అర్బన్ నుంచి బరిలోకి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. 4,500 రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయని పేర్కొన్నారు.
5. హర్ కిరణ్జిత్ సింగ్ : ఫాజిల్కా నియోజకవర్గం నుంచి పోటీ. శిరోమణీ అకాలీదళ్ అభ్యర్థి. 4,500 రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయి.
6. బల్దేవ్ సింగ్ : శార్దూల్ గఢ్ నుంచి బరిలోకి. శిరోమణీ అకాలీదళ్ అభ్యర్థి. 5,000 విలువ చేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయి.
7. గుర్భేజ్ సింగ్ : ఫిరోజ్పూర్లోని గురుహర్ సహాయ్ నుంచి బరిలోకి . స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి. 5,500 విలువ చేసే ఆస్తులున్నాయి.
8. హరీందర్ సింగ్ : పాటియాలా రాజ్పురా నుంచి బరిలోకి. స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి. 5,785 రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయి.
9. సురేశ్ కుమార్ : ఫిరోజ్ పూర్ అర్బన్ నుంచి. సీపీఐఎంఎల్ అభ్యర్థిగా బరిలోకి. కేవలం 1,000 రూపాయలు విలువ చేసే ఆస్తులే ఉన్నాయి.
10. కృష్ణ కుమార్ : ముఫ్తసర్ సాహెబ్ నుంచి బరిలోకి. స్వతంత్ర అభ్యర్థి. 7,000 విలువ చేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయి.