న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులకు మార్చి నెల నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకోలేదన్నట్లు తెలుస్తోంది. 12 నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి. దీనిపై అధికారులు ఇవాళ మరో రకంగా రియాక్ట్ అయ్యారు. 12-15 ఏళ్ల లోపు పిల్లలకు టీకా ఇచ్చే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఓ వార్త సంస్థ పేర్కొన్నది. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ ఏజ్ గ్రూపులో ఉన్న 3.5 కోట్ల మంది టీనేజర్లకు ఇప్పటికే టీకా ఇచ్చినట్లు నిన్ననే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయా తెలిపారు.