ప్రచారం: ఏటీఎంలో నెలలో నాలుగు లావాదేవీలు దాటితే ఆపై జరిపే ప్రతీ లావాదేవీకి రూ. 150 చార్జీ విధిస్తారు. దీనిపై రూ. 23 సేవా రుసుమును కూడా అదనంగా చెల్లించాలి. మొత్తంగా రూ. 173 కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులో జరిపే ప్రతీ లావాదేవీకి రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. గత నెల 1 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి అని సోషల్మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.
వాస్తవం: ఈ ప్రచారం అవాస్తవమని ప్రభుత్వ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చెప్పింది. ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎంలో నెలకు ఐదు లావాదేవీలను ఉచితంగా నిర్వహించుకోవచ్చని, ఆపై జరిపే ప్రతీ లావాదేవీకి రూ. 21 (పన్నులు అదనం) చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది.