పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివిన నితీశ్ కుమార్.. ఇక ముందూ సీఎంగా కొనసాగేందుకు బీహార్లో నిరక్షరాస్యత మరింత పెరగాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. చదువురాని వాళ్లైతేనే చదువురాని తనకు ఓట్లేస్తారనేది నితీశ్ ఆలోచన అని ఎద్దేవా చేశారు.
బీహార్ రాష్ట్రం కూలీల రాష్ట్రంగా మిగిలిపోవడానికి సీఎం నితీశ్ కుమారే బాధ్యుడని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి నితీశ్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. నితీశ్కు చదువు రాదని, కావాలంటే ఆయనను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రశ్నించండని మీడియా ప్రతినిధులను కోరారు. ఆయన కచ్చితంగా మీ ప్రశ్నను దాటవేస్తారని అన్నారు.