భువనేశ్వర్, మే 9: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం భువనేశ్వర్లోని నవీన్ పట్నాయక్ నివాసంలో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తానని నితీశ్ కుమార్ చెప్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే, సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులూ.. రాజకీయాలు, పొత్తుల గురించి చర్చించలేదని ప్రకటించారు. తామిద్దరం పాత స్నేహితులమని, వాజపేయి క్యాబినెట్లో మంత్రులుగా పని చేశామని చెప్పుకొచ్చారు.