CM Nitish Kumar | బెగుసరాయ్, మార్చి 2: తాను ఇక ఎన్నటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఔరంగాబాద్, బెగుసరాయ్లలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శనివారం ఇరువురు నేతలు పాల్గొన్నారు.
నితీశ్ మాట్లాడుతూ, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400కుపైగా స్థానాలు లభిస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు వారసత్వ పాలకులు భయపడుతున్నారని, అందుకే పార్లమెంటులో అడుగుపెట్టేందుకు రాజ్యసభ దారులు వెదుకుతున్నారని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించిన వారిని ఎన్డీయే కట్టడి చేసిందని.. కాంగ్రెస్-ఆర్జేడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.