పాట్నా, ఆగస్టు 11: బీహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బుధవారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా బీజేపీకి చెందిన విజయ్కుమార్ సిన్హా ఉన్నారు. ఆయనను దించేయాలని మహాకూటమి నిర్ణయించింది.
ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. నిబంధనల ప్రకారం ఈ తీర్మానం ప్రవేశపెట్టాక రెండు వారాల తర్వాత దీనిపై అసెంబ్లీలో చర్చ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బలపరీక్షం కొత్త ప్రభుత్వం ఈ నెల 24వరకు వేచిచూడక తప్పదు. 242 మంది ఎమ్మెల్యేలున్న బీహార్ అసెంబ్లీలో మహాఘట్బంధన్ ప్రభుత్వానికి 164 మంది సభ్యుల మద్దతు ఉన్నది.