పూర్నియా, ఏప్రిల్ 30: మతపరమైన ప్రాంతాల్లో లౌడ్స్పీకర్ల వినియోగానికి సం బంధించి రేగిన వివాదంపై బీహార్ సీఎం నితీశ్కుమార్ ఘాటుగా స్పందించారు. అదొక పనికిరాని అంశమని బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చేలా వ్యాఖ్యానించారు. మతపరమైన పద్ధతుల విషయాల్లో తమ ప్రభుత్వం కలుగజేసుకోదని ఆయన స్పష్టం చేశారు.
‘వివాదాలు రేపడమే కొందరు తమ పని అనుకుంటారు. వారు అందులోనే ఉంటారు’ అని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నా రు. యూపీలో మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్స్పీకర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, రాష్ట్రప్రభు త్వం కూడా అలాగే చేయాలని బీహార్ బీజేపీ నేతల డిమాండ్ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.