CM Nitish Kumar | నవాదా, ఏప్రిల్ 7: బీహార్లోని నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తడబాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘4,000’కు పైగా సీట్లు గెలుచుకుంటుందంటూ వ్యాఖ్యానించడం వైరల్గా మారింది. తన ప్రసంగంలో మొదటగా ‘నాలుగు లక్షల’ంటూ తడబడిన నితీశ్.. ఆ తర్వాత సరిదిద్దుకొని మళ్లీ ‘4,000’కు పైగా సీట్లు అని పేర్కొనడం గమనార్హం. దీనిపై నితీశ్ కుమార్ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుండగా.. లోక్సభలో ఎంత మంది ఎంపీలు ఉంటారో కూడా ఎన్డీయే కూటమికి తెలియదని, బీజేపీ నేతల ముఖాల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తున్నదని విపక్ష ఆర్జేడీ ఎద్దేవా చేసింది.