న్యూఢిల్లీ, ఆగస్టు 12: మహాఘట్ బంధన్ ప్రభుత్వ ఏర్పాటుకు బీహార్ సీఎం నితీశ్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్లో విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి వచ్చినట్లుగానే, దేశంలోని అన్ని ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని శుక్రవారం ఆమె నివాసం లో కలిసిన అనంతరం తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను బీజేపీ నాశనం చేయాలనుకుంటున్నదన్న తేజస్వీ.. ప్రజాస్వామ్యానికి ఇది పెనుముప్పుగా అభివర్ణించారు. ధరల పెరుగుదలతో ఒకవైపు ప్రజలు అల్లాడుతుంటే, హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కొందరు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు.