పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శలు గుప్పించారు. 2025 ఎన్నికల తర్వాత తాను సీఎం కాలేనని తెలిసే నితీశ్కుమార్.. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్ను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నారని ఆరోపించారు. తేజస్వి యాదవ్ సీఎం అయితే, ఆయన పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవని, అప్పుడు ప్రజలు విసిగిపోయి మళ్లీ తనకే పట్టంగడుతారని నితీశ్ ప్లాన్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
నితీశ్కుమార్ ఎప్పటికీ తానే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాడని, అందుకే ఆయన కంటే తెలివైన వ్యక్తులు అధికారంలోకి రావడం ఆయనకు ఇష్టం లేదని పీకే విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తనను సీఎం పదవి నుంచి తొలగించి, ఆ పార్టీ నాయకుడిని సీఎంను చేస్తుందని నితీశ్ పసిగట్టారని, అందుకే 2020 మార్చిలో తనతో మహాకూటమి గురించి మాట్లాడారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీకి పోటీగా మహాకూటమి ఏర్పాటు అవసరమని, అందులో మీరు కూడా చేరాలని నితీశ్కుమార్ గత మార్చిలో ఢిల్లీలో తనను కోరినట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. కాగా, ఈ నెల మొదట్లో కూడా నితీశ్కుమార్పై పీకే విమర్శలు గుప్పించారు. అధికార కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీకి సీఎం పదవి ఇవ్వాలని వ్యాఖ్యానించారు.