న్యూఢిల్లీ, జనవరి 3: బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్కుమార్ను ఇండియా కూటమి కన్వీనర్గా నియమించే అవకాశం ఉన్నది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. గత వారం బీహార్ సీఎంను జేడీ(యూ) చీఫ్గా ఎన్నుకున్నారు. ఇండియా కూటమి కన్వీనర్గా నితీశ్కుమార్ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయమని పార్టీ నేత లలన్సింగ్ అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్చలు, వ్యూహాలు రచించడంతో ఆయన అనుభవం, చతురత ఎంతో ఉపయోపడుతుందని పేర్కొన్నారు.