నాగ్పూర్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలోగల ఆయన కార్యాలయానికి మొదటి ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత 11.40 గంటల సమయంలో రెండో ఫోన్ కాల్ వచ్చింది. దాంతో నాగ్పూర్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవాళ ఉదయం 11.30 గంటలకు, 11.40 గంటలకు కేంద్రమంత్రి నితిన్గడ్కరీ కార్యాలయానికి రెండు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదు అందిందని, దాంతో కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని నాగ్పూర్ పోలీసులు తెలిపారు. నితిన్ గడ్కరీని చంసేస్తామని ఆ ఫోన్ కాల్స్లో బెదిరించినట్లు సమాచారం.