Loksabha Elections | న్యూఢిల్లీ : త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పోటీ చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వీరు కర్ణాటక నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. లేదంటే మరో రాష్ట్రం నుంచి తప్పక పోటీలో ఉంటారని పేర్కొన్నారు.
బెంగళూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందా..? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, జాబితా ఫైనల్ కానప్పుడు తాను ఎలా చెప్పగలను అని సమాధానం ఇచ్చారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి, ఎస్ జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.