తిరువనంతపురం, అక్టోబర్ 25: కేరళలోని కోజికోడ్ జిల్లాను గత నెలలో నిపా వైరస్ భయపెట్టిన ఘటన మరువకముందే వయనాడ్ జిల్లాల్లోని గబ్బిల్లాల్లో నిపా వైరస్ పాజిటివ్ లక్షణాలున్నట్టు వెల్లడైంది. ఐసీఎంఆర్ జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ బుధవారం తెలిపారు. ‘రోగులను పరీక్షించేటప్పుడు ఏ చిన్న అనుమానం వచ్చినా డాక్టర్లు జాగ్రత్త వహించాలి’ అని ఆమె కోరారు. నిపా వైరస్ లక్షణాల వల్ల గత నెలలో కేరళలో ఇద్దరు రోగులు చనిపోయినట్టు డాక్టర్లు భావించారు.