గురుగ్రామ్: హర్యానాలోని రేవారీలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జార్తల్ గ్రామానికి చెందిన మోను(21) అనే యువకునికి కసోలి గ్రామానికి చెందిన తన్ను అనే యువతికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ వివాహం ఇష్టం లేని తన్ను తన ప్రియుడు సోనుతో ప్రేమాయణాన్ని కొనసాగించేందుకు, అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ప్రియుని సహకారం తీసుకుంది. జూన్ 8న రాత్రి ఏదో పనిమీద స్కూటర్పై వెళ్లిన మోనుకు అతని భార్య తన్ను ఫోన్ చేసి, కసోలి గ్రామానికి రమ్మని చెప్పింది. అక్కడ అప్పటికే ఆమె ప్రియుడు సోను పంపిన హరిఓం, అమన్లు మాటువేసి ఉన్నారు.
మోను అక్కడికి రాగానే వారు అతనిపై దాడి చేసి, తరువాత అసల్వాస్ కాలువలో పడేశారు. మర్నాడు మోను కనిపించకపోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అసల్వాస్ కాలువలో మోను మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతుని భార్య తన్నును, ప్రియుడు సోనును విచారించారు. దీంతో ఈ హత్య వెనుక కుట్ర బయట పడింది.